కర్ణాటక లో ఒళ్లు గగుర్పాటు కలిగించే ఘటన చోటుచేసుకుంది.ప్రేమించిన యువతి పై ప్రియుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎంత దారుణంగా ఆ వ్యక్తి ప్రవర్తించాడో ఆ దృశ్యాలు అన్నీ కూడా దగ్గర లోని సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.ప్రేమించిన యువతి తనను మోసం చేసిందన్న అనుమానం తో సుశాంత్ అనే యువకుడు గర్ల్ ఫ్రెండ్ పై కత్తితో దాడి చేశాడు.
పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను 12 సార్లు పొడిచాడు, అనంతరం తన మెడను తానే కోసుకుంటూ అక్కడ హల్ చల్ చేశాడు.చివరికి స్థానికులు అడ్డుకోవడానికి కూడా చూసినా అతడి విపరీత ప్రవర్తనకు ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి లో ఉన్నారు.
అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో అక్కడకి చేరుకున్న పోలీసులు,స్థానికుల సాయం తో వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా సుశాంత్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉండడానికి ఆమె చేయి గట్టిగా పట్టుకోవడం గమనార్హం.
దక్షిణ కర్ణాటక లోని మంగళూరు లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.దేరాలకట్టె ప్రాంతానికి చెందిన సుశాంత్, దీక్ష కొంతకాలంగా ప్రేమించుకుం టున్నారు.
సుశాంత్ డ్యాన్సర్ కాగా, దీక్ష స్థానిక డిగ్రీ కాలేజీలో చదువుకుంటోంది.అయితే ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు రావడం తో దీక్ష కొద్దీ కాలంగా సుశాంత్ ను దూరం పెడుతూ వచ్చింది.
అంతేకాకుండా తనను వేధిస్తున్నాడు అంటూ గత ఏప్రిల్ లో దీక్ష పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది.అయితే వీటిని మైండ్ లో పెట్టుకున్న సుశాంత్ దీక్ష వేరే ఎవరినో ప్రేమిస్తోందని, అందుకే తనను దూరం పెడుతోందంటూ అనుమానం పెంచుకున్నాడు.అది కాస్తా పగగా మారింది.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దీక్ష ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చి అడ్డుకున్నాడు.తనను వెళ్లనివ్వాలంటూ ఆమె చెబుతుండగానే కత్తితో దాడి చేశాడు.నాకు దక్కని నువ్వు ఇంకెవ్వ రికీ దక్కకూడదంటూ విచక్షణ రహితంగా 12 సార్లు ఆమెను నడిరోడ్డు పై పొడిచాడు.
అనంతరం తన మెడను కత్తితో పలుమార్లు కోసుకొని అతడు కూడా కుప్పకూలిపోయాడు.