బాలీవుడ్ సెలబ్రిటీస్ అలియా భట్ , రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మాస్త్రం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి అయ్యి భారీ కలెక్షన్లను రాబడుతుంది.ఈ సినిమా మంచి విజయం కావడంతో నటీనటులు పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా, రణబీర్ కపూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంటర్వ్యూ సందర్భంగా మీరిద్దరూ బిజీ స్టార్స్ కదా! ఒకరిపై ఒకరు ఆధారపడుతున్నారా అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.ఇన్ని రోజులు తాను ఇండిపెండెంట్ అని ఎంతో గొప్పగా చెప్పుకునే వాడిని అయితే ప్రస్తుతం అలా కాదు చిన్న విషయమైనా తనపై ఆధారపడుతున్నాను అంటూ సమాధానం చెప్పారు.
ఈ మధ్యకాలంలో అలియా భట్ పక్కన లేకపోతే ఏ పని చేయలేకపోతున్నాను అలాగే తిండి కూడా తినలేక పోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ విధంగా రణబీర్ కపూర్ అలియా భట్ గురించి చెప్పడంతో అలియా తన మాటలను ఏకీభవిస్తూ అవునని సమాధానం చెప్పింది.ప్రతి ఒక్కటి మర్చిపోతూ ఉంటారు నేను పక్కనే ఉండి ప్రతిదీ గుర్తు చేయాలి అంటూ ఈ సందర్భంగా ఆలియా భట్ రణబీర్ గురించి తెలియజేశారు.ఇకపోతే 2017 నుంచి ప్రేమలో ఉండే ఏడాది ఏప్రిల్ నెలలో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే.ఇలా అలియా ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని సినిమా విజయంలో భాగమయ్యారు.