ప్రభాస్ సినిమా కోసం నివేదా అన్ని కోట్లు తీసుకుంటుందట...

తెలుగులో ప్రస్తుతం “టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్” మహానటి చిత్ర ఫేమ్ దర్శకుడు “నాగ్ అశ్విన్” దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రం “సైన్స్ ఫిక్షన్” తరహాలో ఉండబోతుందని అందువల్లనే ఈ చిత్రాన్ని దేశంలో ప్రాధాన్యత ఉన్నటువంటి దాదాపుగా అన్ని భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

 Nivetha Thomas Demands Huge Remuneration,nivetha Thomas, Telugu Heroine, Remune-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా కేరళ కుట్టి నివేదా థామస్ తీసుకున్నారని అంతేగాక ఆమెకి దాదాపుగా 25 నుంచి 30 కోట్ల రూపాయలు పారితోషికం కూడా ఇస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే మొదట హీరోయిన్ గా దీపికా పదుకొనే తీసుకోగా ఆమెకు కూడా దాదాపుగా 50 నుంచి 75 కోట్ల రూపాయల పారితోషకం ఇస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ లెక్కన చూస్తే పారితోషకాలకే దాదాపుగా చిత్ర యూనిట్ సభ్యులు 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

దీంతో ఈ చిత్ర మొత్తం బడ్జెట్ దాదాపుగా 400 కోట్లు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం ప్రభాస్ ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

 దీనికితోడు ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కొంతకాలం పాటు వాయిదా పడ్డాయి.దీంతో నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణ పనులు కూడా కొంతమేర ఆలస్యంగా మొదలు కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube