ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావీవరుసలు మరచి ప్రవర్థిస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కొడుకు ప్రేమను అంగీకరించడం ఇష్టంలేక వారి ప్రేమను విడగొట్టేందుకు గాను కొడుకు ప్రేమించిన టువంటి యువతిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే నాగపట్టణం ప్రాంతంలో నిత్యానందం అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.అయితే ఈ వ్యక్తి కొడుకు ముఖేష్ స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని ప్రేమించాడు.
అంతేగాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయమని వారి ప్రేమ విషయాన్ని తమ తల్లిదండ్రులకి తెలిపారు.అయితే వీరి ప్రేమ వివాహానికి నిత్యానందం అంగీకరించలేదు.
అయితే ఈ విషయాన్ని తన కొడుకుకి తెలియకుండా దాచాడు.అంతేగాక ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడగొట్టాలని పథకం పన్నాడు.
ఈ పథకంలో భాగంగా పెళ్లి విషయమై తనతో మాట్లాడాలని కొడుకు ప్రేమించినటువంటి యువతిని తన ఇంటికి పిలిచాడు.అనంతరం ఆమెను నిర్బంధించి ఆమెపై రెండు రోజుల పాటూ అత్యాచారం చేశాడు.అయితే నిత్యానంద నుంచి తప్పించుకున్నటువంటి ఆ యువతి తన స్నేహితుల సాయంతో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిత్యానందంపై ఫిర్యాదు నమోదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.