జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఆవేశమో .లేక జనాలను చుసిన ఉత్సాహమో తెలియదు కానీ కొద్ది రోజులగా పదునైన మాటలతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు.తాజాగా… తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం … మలికిపురం లో నిర్వహించిన ప్రజా పోరాట యాత్రలో పవన్ ఈ విధంగా ప్రసంగించారు.తాను … అవినీతిని చూసి కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చానని అన్నాడు.
అవినీతి రాజకీయాలను నరికేయడానికే తాను కత్తి పట్టుకుని వచ్చానన్నారు.అవినీతిని ఎదిరించి పోరాడే సైనికుడివి కన్నావని తన తల్లికి చెబితే సంతోషించారని పవన్ తెలిపారు.దశాబ్దాలుగా అవినీతిని చూసి విసిగిపోయామని.ఎదిరించి పోరాడి బతకాల్సిన సమయం వచ్చిందన్నారు.ఈ సందర్భంగా ఏపీ మంత్రి లోకేష్పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు.కోనసీమలో లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టగలరా అని ప్రశ్నించారు.10 కిలోమీటర్లు కూడా సైకిల్ తొక్కలేని వ్యక్తి.తాత, తండ్రిలా ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారని ఎద్దేవా చేసాడు.