చంద్రబాబు అక్కడ చిల్లర ఏరుకుంటున్నాడట !

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శవాలపై చిల్లర ఏరుకునే విధంగా తయారయ్యాడని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

 Ys Jagan Coments On Ap Cm Chandrababu Naidu-TeluguStop.com

ఈ సందర్భంగా… టీడీపీ అధినేత చంద్రబాబు ను టార్గెట్ గా చేసుకుని అనేక సంచలన విమర్శలు చేసాడు.తిత్లీ తుఫాన్ వల్ల రూ.3,435 కోట్లు నష్టం జరిగిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని… అంత నష్టం వాటిల్లితే.బాధితులకు ఎంత డబ్బిచ్చారు అని జగన్ ప్రశ్నించారు.

అంత భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు రూ.520 కోట్లు మాత్రమే విడుదల చేశారని.ఆయన చెప్పిన నష్టంలో 15శాతం కూడా ఇవ్వలేదన్నారు.రూ.520 కోట్లలో కూడా రూ.210 కోట్లే ఖర్చు చేశారని చెప్పారు.కానీ ప్రచారం కోసం తిత్లీ బాధితులను ఆదుకున్నామని విజయవాడలో ప్లెక్సీలు, ఆర్టీసీ బస్సులపై ఫొటోలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube