అందాన్ని పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.అందుకోసమే వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీమ్స్, లోషన్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వంటి వాటిని విరి విరిగా కొనుగోలు చేసి వాడుతుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు.అలాగే మార్కెట్లో దొరికే ఫేస్ మాస్క్లు, ప్యాకులు తెచ్చుకుని వాడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను తీసుకుంటే పైసా ఖర్చు లేకుండా అందాన్ని పెంచుకోవచ్చు.మరి ఆ జాగ్రత్తలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ఆరోగ్యానికే కాదు.చర్మ సౌందర్యానికి నిద్ర ఎంతో అవసరం.కంటి నిండి నిద్ర ఉంటే అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి.అందుకే రోజుకు ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు పాటు నిద్రించాలి.
సాధారణంగా చాలా మంది నిద్రించే సమయంలో దిండుపై ముఖాన్ని గట్టిగా ఆనిస్తుంటారు.ఇలా చేడయం వల్ల చర్మంపై ఉన్న తేమంత తొలగిపోవడమే కాదు.మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు కూడా ఏర్పడతాయి.అందుకే దిండుపై ముఖాన్ని ఆనించకుండా ఉండాలి.
కొందరు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుంటారు.అయితే ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల స్కిన్ లో మెలనిన్ ప్రొడక్షన్ భారీ ఉత్పత్తి అవుతుంది.ఫలితంగా ఫేస్ అంతా డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి.కాబట్టి, ఫోన్ మాట్లాడటం తగ్గించాలి.
చర్మ సౌందర్యం పెరగాలంటే వ్యాయామాలు ఎంతో అవసరం.ప్రతి రోజు కనీసం అర గంట అయినా వ్యాయామాలు చేస్తే.ముడతలు రాకుండా ఉంటాయి.మరియు చర్మం యవ్వనంగా మెరుస్తుంది.
అలాగే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.అప్పుడే చర్మం హెల్తీగా ఉంటుంది.
అందు వల్ల వాటర్తో పాటు ఫ్రూట్ జ్యూసులు, కొకొనట్ వాటర్, బటర్ మిల్క్ వంటి వాటిని బాగా తీసుకోవాలి.
ఇక మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.
డైట్లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.మరియు రోజుకు కనీసం రెండు సార్లు వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి.