న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది.
వెంకట్ బోయనపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.
సినిమాలో ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు బాగానే ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా.
తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని తాను థియేటర్ లో సినిమా చూడటానికి ఇష్టపడతానని కథలో దమ్ముంటే మాత్రమే పీరియడ్ సినిమాలు తీయాలని నాని చెప్పుకొచ్చారు.
ఈ మూవీతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని సినిమా ఫలితం విషయంలో నమ్మకంతో ఉన్నానని నాని చెప్పుకొచ్చారు.ఈ సినిమా కోసం తాను బరువు పెరగలేదని మాట తీరు, నడిచే విధానంలో మాత్రం మార్పును చూడవచ్చని నాని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాకు పని చేసిన జూనియర్ ఆర్టిస్ట్ లకు సైతం స్పెషల్ క్యాస్టూమ్స్ ను డిజైన్ చేశారని నాని అన్నారు.
టక్ జగదీష్ కంటే తక్కువ రేటింగ్ తో ఎంసీఏకు రివ్యూలు వచ్చాయని అయితే ఎంసీఏ బ్లాక్ బస్టర్ హిట్ అని నాని అన్నారు.వీ, టక్ జగదీష్ ఫలితాల వల్ల అమెజాన్ హ్యాపీగానే ఉందని ఈ సినిమాల వల్ల అమెజాన్ కు సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయని నాని వెల్లడించారు.జెర్సీ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్ అని నాని చెప్పుకొచ్చారు.
త్వరలో దసరా మూవీ షూటింగ్ మొదలుకానుందని తెలంగాణ యాసలో ఈ సినిమాలో మాట్లాడతానని నాని వెల్లడించారు.స్టార్ హీరో బాలకృష్ణ గురించి బయట ఏవేవో వింటూ ఉంటామని అయితే అవి నిజం కావని నాని చెప్పుకొచ్చారు.బాలయ్య గురించి పాజిటివ్ గా నాని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.