కరోనా నేపథ్యంలో ఆన్క్లాసులు, వర్క్ ఫ్రం హోం నిర్వర్తించేవారు ఎక్కువే అయినారు.ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు లేనిదే టైం గడవని పరిస్థితి.వివిధ కంపెనీలు అందించే రీఛార్జ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్తో వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందించనుంది.ఎందుకంటే ఆ రీఛార్జ్ ప్లాన్తో అనేక బెనిఫిట్స్ అందుబాటులో ఉండనున్నాయి.ఆ వివరాలు తెలుసుకుందాం.వీఐ రీఛార్జ్ ప్లాన్తో డబుల్ డేటాతోపాటు జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్, ఇతర లాభాలు అందించనుంది.
ఈ ప్లాన్తో 4 జీబీ డేటాతోపాటు నైట్ ఫ్రీ డేటా (12:00 AM –6:00 PM) కూడా వర్తిస్తుంది.ఈ ప్లాన్తో ఏ నెట్వర్క్ అయినా… అపరిమిత కాల్స్తోపాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందవచ్చు.
వీఐ మూవీస్, టీవీ యాప్ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.
వీఐ రూ.449 ప్లాన్ vs రూ.444 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్…

రిలయెన్స్ జియో రూ.444 రీఛార్జ్ ప్లానతో ఏ నెట్వర్క్కు అయిన ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.అందేకాదు డైలీ వంద ఎస్ఎంఎస్ల ఉచితంగా పొందవచ్చు.ప్రతిరోజూ 2 జీబీ డేటా, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.ఇందులో రూ.249 ప్లాన్ కూడా అందుబాటులో ఉండనుంది.దీని వ్యాలిడిటీ 28 రోజులు వర్తిస్తుంది.
ప్రతిరోజూ 2 జీబీ డేటా, అంటే మొత్తం 56 జీబీ డేటా అందించనుంది.అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లతోపాటు జియో యాప్స్ యాక్సెస్ పొందవచ్చు.
వీఐ రూ.449 Vs ఎయిర్టెల్ రూ.449 ప్లాన్…

ఎయిర్టెల్ రూ.449 రీఛార్జ్ ప్లాన్ కూడా 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, వంద ఎస్ఎంఎస్లతోపాటు వినియోగదారులకు అమెజాన్ ప్రైం వీడియో ఎడిషన్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీం, వింక్ మ్యూజిక్, దీని వ్యాలిడిటీ 56 రోజులు వర్తిస్తుంది.