AP Trade Unions : ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు..!

ఏపీలోని ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చలు జరపనుంది.ఈ మేరకు సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రుల బృందంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.పెండింగ్ సమస్యల ( Pending issues )పరిష్కారం కోసం సమ్మె బాట పడతామని ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.

 Government Talks With Ap Trade Unions-TeluguStop.com

ఈ నేపథ్యంలో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది.ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ( Retirement benefits )రిలీజ్ చేయాలంటూ ఉద్యోగులు పట్టు పడుతున్నారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగాలని పిలుపునిచ్చాయి.అలాగే ఈ నెల 15, 16న భోజన విరామంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.17న ర్యాలీలు, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నారని వెల్లడించారు.ఇక 21 నుంచి 24 వ తేదీ వరకు జిల్లాల్లో పర్యటిస్తామంటున్న ఉద్యోగ సంఘాల నేతలు 27న చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube