సుశాంత్ ఖాతాలో రూ.15 కోట్లు మిస్ అయినట్టు ఎలా తెలిసింది?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మృతిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజపుత్ బ్యాంకు ట్రాన్సక్షన్స్ పై దర్యాప్తు జరుపుతున్నారు.

 Ed Recorded Sushanth's Father Statements,ed Recorded, Statement, Kk Singh, Sush-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఈడీ నిన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసారు.ఢిల్లీ ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు అతన్ని పలు ప్రశ్నలు వేశారు.

సుశాంత్ సింగ్ రాజపూత్ బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయం అయినట్టు ఎలా తెలిసిందని ఆరా తీశారు.అంతేకాదు సుశాంత్ సింగ్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తికి 15 కోట్ల రూపాయిలు బదిలీ అయినట్టు ఎలా గుర్తించారని ప్రశ్నించారు.

ఆయన చెప్పిన సమాధానాలను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

అంతేకాదు వారం రోజుల క్రితం రియా చక్రవర్తి, ఆమె సోదరుడున, సుశాంత్ మేనేజర్, ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ తో సహజీవనం చేసినట్టు.ఆ సమయంలోనే సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్టు, సుశాంత్ మృతికి రియా చక్రవర్తి, ఆమె కుటుంబమే కారణం అని ఫిర్యాదు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube