ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి లోఫ్లోర్ బస్సుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై.
సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ప్రతిపాదన వచ్చింది.ఈ ప్రతిపాదనకు సక్సేనా ఆమోదం తెలిపారు.
దీంతో బస్సుల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు జరగనుంది.
అయితే ఇప్పటికే ఆప్ ప్రభుత్వం లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది.
ఇదే అంశంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.