ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పని చేస్తున్నాయని తెలిపారు.
ఆరు గ్యారెంటీలు కాదు.అమ్ముడుపోరని గ్యారంటీ ఇవ్వగలరా అని బండి సంజయ్ కాంగ్రెస్ ను ప్రశ్నించారు.
ఈ క్రమంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సుస్థిర పాలన సాధ్యమని చెప్పారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయిస్తామన్న బండి సంజయ్ ప్రతి డివిజన్ లో వంద పడకల ఆస్పత్రికి ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.