జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన కేంద్రం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరద ప్రాంతాల్లో… జగన్ ప్రభుత్వం పని తీరు అద్భుతమని కేంద్ర బృందం ప్రశంసల వర్షం కురిపించింది.రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి కేంద్ర బృందం వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిం చడం జరిగింది.

 Central Governament Praises Jagan Governament Ys Jagan, Kadpa, Floods, Kunal Sat-TeluguStop.com

అనంతరం సోమవారం సీఎం జగన్ తో… భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలను పరిశీలించి కేంద్ర బృందం సీఎం జగన్ కి వివరించడం జరిగింది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్ధి వివరాలను అందించారు.

ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంలో.

కునాల్ సత్యార్ధి మాట్లాడుతూ మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామనీ, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయనీ, పశువులు చనిపోవడం జరిగిందన్నారు.

తమ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమన్నారు.

వరద ప్రభావం ఎక్కువగా ఉన్న… డ్యాములు మరియు రిజర్వాయర్లు.వరదలను ఎదుర్కొనే అంతా కెపాసిటీ కలిగినవి కావని.

అదే రీతిలో చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని స్పష్టం చేశారు.సరిగ్గా రైతుల పంట చేతికందే సమయంలో.

వరదల రావటంతో పంట నీటి పాలు కావడం జరిగింది అని పేర్కొన్నారు.ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాలలో అధికారుల పనితీరు చాలా బాగుందని ఈ సందర్భంగా కునాల్ సత్యార్థి ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube