ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు.నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం.
అయితే తాజాగా చేపట్టిన ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్థిక శాఖ పై కేంద్రానికి బిజెపి నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది.అడ్డదారుల్లో బ్యాంకుల వద్ద రుణాలు పొందుతున్నట్లు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
ఈ విషయం గురించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.కరోనా కష్టకాలంలో కేంద్రం ఏ ఒక్క రాష్ట్రానికి నిధులు ఆపలేదని తెలిపారు.
కేంద్రం పై నిందలు వేయడానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి అదే రీతిలో సజ్జల కి ఇటువంటి నైతిక హక్కు లేదని అన్నారు.అంతే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగా దిగజారి మాట్లాడలేము అని అన్నారు సోము వీర్రాజు.
ఇదే క్రమంలో మరికొంత మంది కేంద్ర మంత్రులను కలిసి ఉన్న ఏ బిజెపి నేతలు నిధుల విషయంలో రివ్యూ కోరుతున్నట్లు సమాచారం.