ఏ అమ్మాయి అయినా తన పెళ్లి( Marriage ) తర్వాత తల్లిని కావాలని ఆశించడం సర్వసాధారణమే.అలా గర్భం దాల్చిన తొమ్మిది నెలల తర్వాతనే బిడ్డను కంటుంది మాతృమూర్తి( Mother ).
కాకపోతే., ఓ మహిళ తనకే తెలియకుండా ఏకంగా 56 సంవత్సరాల పాటు గర్భంతో ఉంది.
ఈ మధ్యకాలంలో ఆమెకు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది.ఆ సమయంలో ఆవిడ పరిస్థితి బయటపడింది.నిజానికి ఆమె ఉన్న పరిస్థితి పరిశీలించి డాక్టర్లు ఒకింత షాక్ అయ్యారు.ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.
బ్రెజిల్( Brazil ) లో నివసిస్తున్న డానియేలా వెరా అనే 81 ఏళ్ల వృద్ధురాలు దాదాపు 5 దశాబ్దాలుగా తన కడుపులో ఓ పిండాన్ని మోస్తూ ఉంది.కాకపోతే ఈ విషయం ఆమెకు తెలియకపోవడమే విచిత్రం.కడుపులో ఉన్న పిండం( Embryo ) చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందింది.
అలా మృతి చెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది.తాజాగా ఆమెకు కడుపునొప్పి( Stomachache ) తీవ్రం కావడంతో వెంటనే వైద్యులను సంప్రదించింది.
ట్రీట్మెంట్లో భాగంగా వృద్ధురాలి ఎక్స్ రే ను గమనించిన డాక్టర్స్ షాక్ గురయ్యారు.విషయాన్ని సదరు మహిళలకు తెలపడుతుందో ఆమె కూడా ఆశ్చర్యానికి లోనయింది.
పిండం ఆమె గర్భంలో చాలా సంవత్సరాల క్రితమే చనిపోయిందని అలా చనిపోయిన పిండం గడ్డకట్టుకుని అక్కడే ఉందని వైద్యులు తెలిపారు.అయితే ఆ వృద్ధురాలు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రోజులు ఆమెను గమనించిన తర్వాత డాక్టర్లు మార్చి 15న ఆపరేషన్ చేసి లోపల ఉన్న చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు.అయితే ఇలా చేయడం ద్వారా.ఆ మహిళలకు ఇన్ఫెక్షన్( Infection ) సోకి తాజాగా మృతి చెందింది.అయితే ఇలాంటి పరిస్థితులు గర్భసంచికి అవతల పిండం ఏర్పడితే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు తెలుపుతున్నారు.