యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంతో శాంతి చర్చల విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ వివరణ ఇచ్చారు.ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపించనున్నట్లు యుఎల్ఎఫ్ఏ సంస్థ పరేశ్ బారువా ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
సార్వభౌమత్వం డిమాండ్ ను పరేశ్ బారువా వదులుకుంటేనే చర్చలు సాధ్యమని బిస్మాశర్మ వెల్లడించారు.ఉల్ఫాతో సంప్రదింపులకు మార్గాలు తెరిచే ఉన్నాయన్న ఆయన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అనంతరం ఉల్ఫా తిరుగుబాటు సమస్య పరిష్కారంలో అసోం ప్రజల కీలక పాత్రను సీఎం అభినందించారు.