1.హైదరాబాద్ కు లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.తారకరత్న భౌతికకాయానికి లోకేష్ నివాళులు అర్పించమన్నారు.
2.పాదయాత్రలో షర్మిల అరెస్టు
మహబూబాబాద్ సమీపంలో బేతాళులో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
3.గరికపాటికి గురుశ్రీ పురస్కారం

మహా సహస్రావధని పద్మశ్రీ గరికపాటి నరసింహారావుకు చెన్నైలోని శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ‘ గురు శ్రీ ‘ పురస్కారం ప్రధానం చేసింది.
4.చత్రపతి శివాజీ ర్యాలీకి హైకోర్టు అనుమతి
చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులో హిందూ సంఘం ఆధ్వర్యంలో నిరసనకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
5.వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గం
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయింది.నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా విజయ రాఘవ, వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
6.హరీష్ రావు కామెంట్

అభివృద్ధి చూడండి తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షలను ఉద్దేశించి అన్నారు.
7.ఆర్ ఆర్ కు మరో అవార్డు
ఆర్ఆర్ సినిమాకు మరో రెండు అవార్డులు దక్కాయి.ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ వచ్చి చేరాయి .హాస్టల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ ప్రజెంట్ చేసే అవార్డులలో ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఫారిన్ ఫిలిం క్యాటగిరిలో అవార్డు గెలుచుకుంది.
8.సూర్యాపేట జిల్లాలో భూకంపం

సూర్యాపేట జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.పులిచింతల ప్రాజెక్టు సమీపంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు 3.2 గా తీవ్రత నమోదయింది.
9.తారకరత్న మృతికి ప్రధాని సంతాపం

ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న మూర్తికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
10.సండే ఫండే కార్యక్రమం
ట్యాంక్ బండ్ పై సండే ఫండే కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరగనుంది.దీంతో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
11.ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్ష

నేడు ఏపీలో ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్ష ప్రారంభమైంది.రాష్ట్రవ్యాప్తంగా 2009 యొక్క పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
12.కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో కీలక సమావేశం
బిజెపికి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసం లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి కన్నా అనుచరులు, కీలక నాయకులు హాజరు కాబోతున్నారు.
13.సోము వీర్రాజు పర్యటన

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు గిద్దలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
14.నటుడు జోగి నాయుడుకి కీలక పదవి
ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా జోగి నాయుడిని ఏపీ ప్రభుత్వం నియమించింది.
15.శివాజీ థీమ్ పార్క్ ప్రారంభం

మహారాష్ట్రలోని పూణేలో చత్రపతి శివాజీ పేరు మీద ఏర్పాటు చేసింది.థీమ్ పార్కును కేంద్ర హోం మంత్రి ప్రారంభించారు.
16.ఆదియోగి సేవలో రజనీకాంత్
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణ తో కలిసి కర్ణాటక చిక్ బల్లాపూర్ జిల్లాలోని ఆదియోగి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
17.బిజెపికి మంత్రి బొత్స ప్రశ్న

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్ లో తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.బిజెపి రోజురోజుకు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని బొత్స మండిపడ్డారు.
18.మహాప్రస్థానంలో తారకరత్న అంతిక్రియలు
సినీ హీరో నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగునున్నాయి.
19.పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యుఐడిఏఐ నిర్ణయం తీసుకుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,950
.