టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.తమన్నా, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఫెయిల్ అయితే సమంత మాత్రం ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో డీ గ్లామరస్ గా కనిపిస్తూనే తన నటనతో మెప్పించి నటిగా మరో మెట్టు ఎదిగారు.
పెళ్లైనప్పటికీ ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గా కనిపించడం సమంతకే చెల్లింది.
వెబ్ సిరీస్ రిలీజ్ కు మందు సమంత నటిస్తున్న రాజీ పాత్ర వివాదంలో చిక్కుకోవడంతో సమంత ఫ్యాన్స్ టెన్షన్ పడగా వెబ్ సిరీస్ రిలీజైన తర్వాత మాత్రం సమంత గురించే అందరూ మాట్లాడుకోవడంతో పాటు వెబ్ సిరీస్ లో వివాదాస్పద సన్నివేశాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధించిన సమంత ఒక వర్చువల్ సదస్సులో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కరోనా మహమ్మారి తనను మార్చిందంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనం పర్యావరణాన్ని కచ్చితంగా పరిరక్షించుకోవాలని సమంత అన్నారు.తనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమని సమంత పేర్కొన్నారు.
మనలో మార్పు వస్తే మాత్రమే పర్యావరణం కాలుష్యం లేకుండా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.పర్యావరణం బాగుంటే మాత్రమే మనం బాగుండటం సాధ్యమవుతుందని సమంత అన్నారు.
తన ఇంటి టెర్రస్ మీద ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నానని హైడ్రోప్రోనిక్స్ టెక్నిక్ తో తాను ఈ పని చేస్తున్నానని సమంత అన్నారు.తాను ప్రస్తుతం పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయానని ఇంట్లో పచ్చని మొక్కలను పెంచడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని ఆమె అన్నారు.