యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’.వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘1’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.దాంతో ఈ సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా తీయాలని సుకుమార్ కృషి చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక 25వ సినిమా అవ్వడం వల్ల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను దాదాపు 50 కోట్లకు పైబడిన బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.ఇంత బడ్జెట్తో తెరకెక్కుతుండటం వల్ల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను భారీ మొత్తానికి అమ్మి విడుదలకు ముందే బడ్జెట్ను రాబట్టుకోవాలని నిర్మాత ప్లాన్గా తెలుస్తోంది.
ఇప్పటికే నైజాం మరియు సీడెడ్ ఏరియాల్లో నిర్మాత ఆశించినంత ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది.కాని ఆంధ్ర ఏరియాకు వచ్చే సరికి ఈ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు.
ఈ సినిమా ద్వారా ఆంధ్రా ఏరియాలో 25 కోట్లు రాబట్టాలని నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు.దాంతో డిస్ట్రిబ్యూటర్లు అంత పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఎన్టీఆర్ సినిమాకు ఆంధ్రా ప్రాంతంలో 25 కోట్లు పెట్టి కొనేంత సీన్ లేదు అని, ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ సినిమా కూడా ఆంధ్రాలో ఇంత మొత్తం వసూళ్లు చేసింది లేదు.అందుకే డిస్ట్రిబ్యూటర్లు కొనేందుకు సంశయిస్తున్నారు.15 నుండి 18 కోట్ల వరకు అయితే ఆంధ్రాలో ఈ సినిమాను ఎగబడి డిస్ట్రిబ్యూటర్లు కొనే అవకాశాలున్నాయి.కాని 25 కోట్ల సీన్ ‘నాన్నకు ప్రేమతో’కు ఆంధ్రాలో లేదు అని ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.
మరి నిర్మాత తగ్గాతాడా లేక డిస్ట్రిబ్యూటర్లు పెరుగుతారా అనేది సినిమా విడుదల సమయంకు తేలనుంది.