కోట్లాది మందిని వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరసలో ఉంటాయి.ఒకవేళ మొటిమలు తగ్గినా.
వాటి తాలూకు మచ్చలు మాత్రం పోకుండా మనల్ని మదన పెడుతూనే ఉంటాయి.ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయినా తగ్గకుంటే ట్రీట్మెంట్స్ వరకు వెళ్తారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాను ట్రై చేస్తే మొటిమలే కాదు వాటి వల్ల ఏర్పడ్డ మచ్చలనూ సులభంగా పోగొట్టుకోవచ్చు.
మరి ఆలస్యమెందుకు ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక అరటి పండు తొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం, కట్ చేసి పెట్టుకున్న అరటి ముక్కలు వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత మిక్సీ జార్లో ఉడికించి చల్లారబెట్టుకున్న అరటి ముక్కలు, రైస్ వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుని.ఏదైనా మాయిశ్చరైజర్ను రాసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక మొటిమలు, వాటి వల్ల పడిన మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.
ముఖ చర్మం స్మూత్గా, బ్రైట్గా మారుతుంది.మరియు స్కిన్ టైట్గా కూడా తయారవుతుంది.
కాబట్టి, ఖచ్చితంగా పైన చెప్పిన చిట్కాను ట్రై చేయండి.