సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ...

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన 24 వేల రూపాయల చెక్కును కే రాజుకు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్(Congress ) అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Ministers Relief Fund ) నుండి చాలామంది పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను అందజేస్తున్నామన్నారు.

 Distribution Of Cms Relief Fund Check... , Cms Relief Fund, Distribution ,rajann-TeluguStop.com

రానున్న కాలంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఇండ్లను కూడా మంజూరు చేస్తామన్నారు.ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సహాయం చేస్తుందని అన్నారు.

విదేశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు కొత్తపల్లి దేవయ్య,చెన్ని బాబు,గుండాటి రామ్ రెడ్డి,వాడ్నాల ఆంజనేయులు,గొల్లపల్లి మల్లేశం,గోపాల్, శ్రీనివాస్,ఎండి ఇమామ్,రమేష్,హైమద్ ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube