రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాకేష్ రెడ్డి అనే యువకుడు వినాయక నిమజ్జనం రోజున ప్రమాదవశత్తు ట్రాక్టర్ పై నుండి కిందపడి మరణించాడు.వారి ఆర్థిక పరిస్థితి బాగోలేనందున వారి కుటుంబానికి మండల రెడ్డి సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంను అందించారు.
ఆ కుటుంబానికి రెడ్డి సంఘం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, కోరుట్ల పేట లక్ష్మారెడ్డి, మద్దుల లక్ష్మారెడ్డి, ప్రవీణ్ రెడ్డి,జంగ బాల్ రెడ్డి, ఇప్ప రవీందర్ రెడ్డి,డాక్టర్ అమరేందర్ రెడ్డి,మాధవరెడ్డి, సత్తిరెడ్డి,సంజీవరెడ్డి,దేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.