కథలాపూర్ మండలంలో పర్యటించిన వేములవాడ ఎమ్మెల్యే.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు( Chennamaneni Ramesh Babu ) కథలాపూర్ మండలంలో కలికొట వద్ద లో చెరువును, పోతారం వద్ద ప్రమాదకర స్థితిలో వున్న రోడ్ కల్వర్టును, సిరికొండ – తక్కెళ్ళపల్లి రోడ్డును, తండ్రియాలా – గంభీర్పూర్ రోడ్ లోని కల్వర్టులను మరియు చెరువులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల విపత్తు కారణంగా పంట నష్టం, రహదారులు కొట్టుకుపోవడం, ఒర్రెలు, వాగులు, చెరువులు, వంతెనలు తెగిపోవడం వల్ల ఇండ్లు దెబ్బతినడం జరిగిందని అన్నారు.

 Vemulawada Mla Who Visited Kathalapur Mandal , Kathalapur Mandal-TeluguStop.com

ఈ నష్టం గురించి జిల్లా మంత్రి కి వివరించామని రైతులు, ప్రజలు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నామని అన్నారు.అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు, రైతులకు అండగా నిలవాలని అన్నారు.

విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని జరిగిన నష్టాన్ని తెలియజేయాలని అన్నారు.ప్రభుత్వానికి కూడా సమాచారం అందుతున్నదని, ప్రభుత్వం ఎప్పుడు రైతులు పక్షాన వుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జెడ్.పి.టి.సి నాగం భూమయ్య, వైస్ ఎం.పీ.పీ కిరణ్ రావు, పార్టీ అధ్యక్షులు గంగ ప్రసాద్, ఫాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎం.పి.టి.సీలు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube