కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో( Komaram Bheem Asifabad ) విషాద ఘటన చోటు చేసుకుంది.కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నదిలో( Wardha River ) నలుగురు యువకులు గల్లంతయ్యారు.
హోలి పండుగను( Holi Festival ) పురస్కరించుకుని సరదాగా ఈత కొట్టేందుకు యువకులు వార్దా నదికి వెళ్లారని తెలుస్తోంది.
గల్లంతైన యువకులు కమలాకర్, సంతోష్, సాయి మరియు ప్రవీణ్ లుగా గుర్తించారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.