యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా అండర్ డ్రైనేజీ,సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అండర్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగడంతో జనరల్ ఎలక్షన్స్ కోడ్ ముగిసినా సీసీ రోడ్డు పూర్తిచేయలేదు.
నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చిన సిసి రోడ్లు నిర్మాణాలు అంతట జరిగాయి.కొన్ని కొన్నిచోట్ల శంకుస్థాపనలు చేసి వదిలేశారు.
అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనుల కోసం వేగవంతంగా పనులు జరగలేకపోవడం వలన ఆ కాలనీలో శంకుస్థాపన జరిగిన సీసీ రోడ్డుని మరిచారని ఆరోపణలు వస్తున్నాయి.ఎన్నో ఏళ్ల తర్వాత మా కాలనికి సీసీ వస్తుందని ఆశపడ్డ కాలనీ వాసులకు నిరాశే మిగిలింది.
శంకుస్థాపన జరిగిన పనులు ఎందుకు నిలిపివేశారని అడిగితే ప్రభుత్వం మారింది ఏమీ చేయలేమని అంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నిలిచిపోయిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఎన్నో ఏండ్ల నుండి ఎదురుచూస్తున్న రోడ్డు పడకపోవడం విడ్డూరంగా ఉంది.ప్రభుత్వాలు మారితే పనులు ఆపేస్తారా?అని కాలనీ యువకుడు గంజి ఉమాకాంత్ నేత ప్రశ్నించారు.పాలకులు మారినా మా కాలనీ మాత్రం మారడం లేదని, ఉప ఎన్నిక పేరుమీద అండర్ డ్రైనేజీ వేసి సీసీ వేద్దామనేసరికి ప్రభుత్వం మారిందని చెబుతున్నారని,మోరీల సమస్య తీరిందనుకున్న సమయంలోనే సిసి సమస్య ఏర్పడిందని, కనీసం ఈ ప్రభుత్వమైనా మా కాలనీలో సిసి రోడ్డు వేయాలని కోరుతున్నారు.