ఈ రోజుల్లో నూనెలు, పప్పులు, బియ్యం, ఇంకా ఇతర ఆహార పదార్థాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో చిన్న టీ షాప్ నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని ఫుడ్ ఐటమ్స్ రేట్లు డబుల్ అయ్యాయి.
ప్రస్తుతం చిన్నపాటి టిఫిన్ సెంటర్లలో ప్లేట్ ఇడ్లీ, బోండ లేదా దోశ కొనాలన్నా కనీసం 30 రూపాయలు వేచించాల్సి వస్తోంది.మరికొన్ని చోట్ల ఈ రేట్లు రూ.100 వరకు పలుకుతున్నాయి.ఇక భోజనం చేయాలంటే రూ.150 వరకు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది.
ఇలాంటి హై రేట్స్ ఉన్న నేపథ్యంలో ఒక బిర్యానీ సెంటర్ యజమాని కేవలం 10 రూపాయలకే రుచికరమైన వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు.
వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించినా.నమ్మక తప్పదు ఎందుకంటే కళ్ళముందే అతను పది రూపాయలకు కడుపునిండా వేడివేడి బిర్యానీ అందిస్తున్నాడు.ఇంతకీ ఎవరతను.ఈ బిర్యానీ సెంటర్ ఎక్కడ అనేది తెలుసుకుంటే.
మధ్యప్రదేశ్కు చెందిన మహేష్ గాజులరామారం డివిజన్ దేవేందర్నగర్లో ఒక బిర్యానీ సెంటర్ పెట్టాడు.గతంలో ఈ వంటగాడు అంబర్పేట్లో బిర్యానీ సెంటర్ నడిపేవాడు.
ఇప్పుడు దేవేందర్నగర్కి తన సెంటర్ను షిఫ్ట్ చేసి అక్కడి ప్రజలకు రూ.10కే వెజ్ బిర్యానీతో దేవుడిగా మారాడు.పది రూపాయలకి ఈ రోజుల్లో తినేవి ఏమైనా వస్తున్నాయా అని అడిగితే టక్కున సమాధానం చెప్పడం కష్టం.ఇలాంటి రోజుల్లో అతను పెద్దగా లాభాలను చూసుకోకుండా పది రూపాయలకే టేస్టీ బిర్యానీ ప్రజలకు అందిస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.
డైలీ 70 నుంచి 100 ప్లేట్ల వరకు బిర్యానీ సేల్ చేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మహేష్ ఆకలితో ఉన్నవారికి కడుపు నింపితే వచ్చే సంతృప్తి వేరని అంటున్నాడు.
అటుగా వెళ్లే వాహనాదారులు రూ.10కే వెజ్ బిర్యానీ బోర్డు చూసి ఇక్కడ క్యూ కడుతున్నారు.అలా ఎప్పుడూ తన బిర్యానీ సెంటర్లో రష్ ఉంటుందని ఇతని చెబుతున్నాడు.
ఇకపోతే మహేష్ అంబర్పేట్లో తన బిర్యానీ సెంటర్ను మూసి వేయలేదు.అందుకు బదులుగా దానిని తన కుటుంబ సభ్యులకు అప్పగించాడు.
అలా అక్కడ కూడా ప్రజలకు తక్కువ రేట్లకే మంచి బిర్యానీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.