టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.
తమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
అఖండ నుండి వరుస విజయాలు అందుకోవడంతో ఈయననే మళ్ళీ మళ్ళీ తమ సినిమాలకు రిపీట్ చేస్తున్నారు హీరోలు.ఇక ఈసారి సంక్రాంతికి కూడా థమన్ తన ఖాతాలో రెండు సినిమాలు వేసుకున్నాడు.
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాకు థమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.అలాగే థమన్ తమిళ్ సినిమాకు కూడా సంగీతం అందించాడు.
ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ‘వారసుడు’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మించగా ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసాడు.ఈ సినిమా 200 కోట్ల వసూళ్లను దాటి మరింత స్ట్రాంగ్ గా కలెక్షన్స్ రాబడుతుంది.థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.ఈయన కెరీర్ లోనే ఫస్ట్ టైం థమన్ విజయ్ తో సినిమా చేసాడు.
అందుకే అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.డైరెక్టర్ వంశీ ప్రతీ సందర్భం చెప్పి మరీ థమన్ తో ట్యూన్ ఇప్పించుకున్నారట.ముందే చెప్పి మరీ ఆరు సిక్స్ లు ఇస్తానని థమన్ అలాగే చేయడం జరిగింది.ఇలా ఈ ఏడాది మొదట్లోనే థమన్ రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ముందు ముందు కూడా ఈయన మరింత ఫోకస్ పెట్టి సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.