సినిమా రంగం అంటేనే కళల ప్రపంచం.తమ జీవితాలను సినిమాతో ముడిపెట్టిన తరమణులు ఏంటో మంది.
ఒక వెలుగు వెలిగి కనుమరుగైపోతూనే ఉన్నారు.సినిమా అంటే ఇష్టంతో, అదే ప్రపంచమని నమ్మి ఇండస్ట్రీ కి వచ్చి ఎంతో పై స్థాయికి చేరుకొని ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న తప్పుల కారణం గా తెరమరుగైపోతుంటారు.
ఆలా శాశ్వతంగా సినిమా ఇండస్ట్రీ ని కూడా వదిలేసినా వారు ఉన్నారు.అందుకు అనేక కారణాలు ఉన్నాయ్.
వారు బాగా డబ్బు సంపాదిస్తున్న క్రమంలో వ్యసనాల బారిన పడటం.జల్సాలు చేస్తూ అధిక ఖర్చులు చేసి డబ్బు పాడు చేసుకోవడం తో అవసాన దశలో ఇబ్బందులను ఎదుర్కొవడం వంటివి జరుగుతాయి.
ఆలా నాటి స్టార్ హీరోయిన్ అయినా పసుపులేటి కన్నాంబ విషయంలోనూ ఇలాగే జరిగాయి.ఆమె దర్శకుడు అయినా కడారి నాగభూషణం ని పెళ్లి చేసుకున్నారు.వివాహం అయినా తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె అనేక సినిమాల్లో నటించారు.
ఆమె తొలి తరం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించిన హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.నవరసాలు తనదైన శైలి లో అద్భుతంగా పోషించ గల నటీమణి గా, 150 కి పైగా చారిత్రాత్మక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి గొప్ప కీర్తిని గడించింది.
తన భర్తతో కలిసి సినిమా నిర్మాణం కూడా చేపట్టిన కన్నాంబ చివరి రోజుల్లో ఏమి లేకుండా మిగిలిపోయారు.ఉన్న ఆస్తులు కూడా వేలంలో కి వెళ్లి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె శేష జీవితాన్ని గడిపారు.ఆమె నిర్మాణ సంస్థను కూడా అమ్ముకున్నారు.అయితే ఆమె సంస్థ అయినా రాజరాజేశ్వరి నిర్మాణ సంస్థను కొందరు మద్రాస్ కి చెందిన వారు కొనగా అందుకు ఎన్టీఆర్ పేరును వాడుకున్నారు.
ఎన్టీఆర్ చెప్తేనే మేము వేలంలో కొంటున్నాం అని చెప్పడం తో కన్నాంబ మరియు ఆమె భర్త ఆ సంస్థను అతి తక్కువ ధరకే అమ్మేసారు.అయిత్ ఈ విషయం ఎన్టీఆర్ తెలియడం తో వారి దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పారట.
అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్ తో చెప్పి ఆ సంస్థను కొన్న వారిపై కేసు కూడా పెట్టించారు.