బాలీవుడ్ ప్రముఖ సింగర్ కేకే ఆకస్మిక మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సింగర్ కేకే కి సంబంధించిన వార్తలు, అతని పేరు మారుమోగుతున్నాయి.
అన్ని భాషల్లో ఎన్నో మంచి మంచి పాటలను పాడి అన్ని ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ కేకే.మరీ ముఖ్యంగా తెలుగులో అయితే స్టార్ హీరోల సినిమాలకు ఎన్నో మంచి మంచి పాటలు అందించారు.
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలకు సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ ను కూడా అందించారు కేకే.
తాజాగా కలకత్తాలో ఇచ్చిన ప్రదర్శన ఈ సమయంలో అక్కడ ఆడిటోరియంలో కలిగిన అసౌకర్యం వల్లే కేకే మరణించాడు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
ఆడిటోరియం సిబ్బంది కెపాసిటీ కి మించి రెట్టింపుగా అక్కడికి జనాలను ఇన్వైట్ చేశారని, అప్పుడు ఊపిరి ఆడక కేకే మధ్యలో ఇబ్బంది పడ్డారని చివరికి మధ్యలోనే అక్కడి నుంచి తెలుస్తోంది.ఇదిలా ఉంటే కేకే మొహంపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
దీనితో అతను మృతి పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కేకే చేసిన పాత ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
అందులో అభిమాని తనకు గతంలో కేకే ఇచ్చిన రిప్లై ట్వీట్ చేశాడు.నేను నా జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతూ ఉన్నానో నా జీవితంలోకి చీకటి వచ్చిందో ఆ సమయంలో తోడు ఉన్నది మీ పాటలే సార్ అని ఒక నెటిజెన్ కేకే కు ట్వీట్ చేశాడు.ట్వీట్ పై స్పందించిన కేకే నీకు ఎప్పటికీ జీవితంలో అలాంటి పరిస్థితి రావద్దు మీకు అసలు బాధలు రావద్దు అని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చాడు.
అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ట్వీట్ ని బట్టి చూస్తే తన పాటలు వినే పరిస్థితికి రావద్దు అంటూ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.
మామూలుగా ఎవరైనా వారి పాటలు వింటె థాంక్స్ అని చెబుతారు.కానీ కేకే మాత్రం తన పాటలు వినకపోయినా పర్లేదు కానీ బాధ లో మాత్రం ఉండద్దు అని ప్రార్థించాడు అంటే ఇంతకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.