నల్లగొండ జిల్లా:రాజస్థాన్ నుండి ఏపీకి బయలుదేరిన లారీ నల్లగొండ జిల్లా దామరచర్ల వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.లారీలో మంటలు చెలరేగడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఈ ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పీ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.