శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈ రోజు ది.01-04-2022న గౌరవనీయులైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వర రావు(నాని) గారు మరియు శాసనసభ్యులు(గన్నవరం) శ్రీ వల్లభనేని వంశీ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు .