సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య రజినీ కాంత్.ఈమె పేరు గతంలో పెద్దగా సోషల్ మీడియా లో కానీ ఇతర మీడియా లో గాని వినిపించింది లేదు.
ధనుష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె పేరు ఎక్కువగా ప్రచారం జరిగిందే లేదు.సినిమా లకు దర్శకత్వం వహించినా నిర్మాణం చేసినా కూడా ఈమె ఎక్కువగా సోషల్ మీడియా లో సందడి చేసిందే లేదని చెప్పాలి.
కానీ ఈ మధ్య కాలం లో ఈమె గురించి మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.ధనుష్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అసలు కారణం ఏంటి అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
అదే సమయం లో ఆమె ఆరోగ్యం గురించి కూడా ప్రచారం జరిగింది.ఆమె పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ప్రచారం జరిగింది.
కరోనాను ఎదుర్కొన్న ఆమె ఆ తర్వాత ఆరోగ్యంగా బయట పడింది.కానీ మరో సారి ఆమె అనారోగ్యం బారిన పడినట్లుగా వార్తలు వచ్చాయి.గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది.ఎట్టకేలకు ఆమె ఆరోగ్యం పై క్లారిటీ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.ప్రస్తుతం ఆమె ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తూ తాను వర్క్ లో బిజీగా ఉన్నట్లు గా పేర్కొంటూ ఆ ఫోటోలని షేర్ చేసింది.ఐశ్వర్య వరుసగా సినిమాలకు రెడీ అవుతోంది.దర్శకత్వం చేస్తూ సినిమాలు.నిర్మించడం ద్వారా బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.ధనుష్ నుండి విడి పోయిన తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు వచ్చాయి.
కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేసింది.ధనుష్ తో విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయం పై ఇంకా ఎలాంటి స్పష్టత హామీ ఇవ్వలేదు.
కానీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అనేది మాత్రం తమిళ మీడియా వర్గాల టాక్.