కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం.కొడాలి కన్వెన్షన్ సెంటర్కు భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు.
గుడివాడలో ఇవాళ తెదేపా నిజనిర్ధారణ కమిటీ పర్యటన.గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రదేశం పరిశీలించనున్న కమిటీ.
భారీగా మోహరించిన పోలీసులు.
గుడివాడ కు చేరుకునే అన్ని రహదారులకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.
కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్య.పూర్తిస్థాయి నివేదికను తెదేపా అధిష్ఠానానికి ఇవ్వనున్న కమిటీ.
తెదేపా నేతల గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ.