రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు.ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి సాధిస్తున్నారన్నారు.
రాష్ట్రం అప్పుల పాలైపోయిందన్న ఆమె బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు.త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.