బుల్లితెరలో రియాల్టీ షో, కామెడీ షో వంటివి ఎక్కువగా ప్రసారం అవుతుంటాయి.ఇక రియాల్టీ షో ల గురించి అందరికీ తెలిసిందే.
డాన్స్, ఎంటర్టైన్మెంట్ వంటి రియాల్టీ షో లు ఉండగా అందులో ముఖ్యంగా బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు షో వంటివి కొన్ని ఎపిసోడ్ లతో ప్రసారమయ్యాయి.ఇదిలా ఉంటే తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు షో మరోసారి ప్రసారం కానుండగా.
ఎన్టీఆర్ నుండే కాస్త ఆలస్యం.
ఇదివరకు స్టార్ మా లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం అయిన సంగతి తెలిసిందే.
ఇందులో ఎంతమంది సామాన్యులు ఆట లో పాల్గొని డబ్బులు సొంతం చేసుకునే వాళ్ళు.ఇదివరకు ఈ షో లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయగా.
ఇప్పుడు జెమినీ లో ప్రసారం కానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్నాడు.
జెమినీ లో ప్రసారం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గా ప్రసారం చేయనున్నారు.
ఇక ప్రస్తుతం షో కు సంబంధించిన ఆఫ్ లైన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి.ఇక తిరుపతిలో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి.
అన్ని పూర్తి అవుతున్న తరుణంలో ఎన్టీఆర్ హోస్టింగ్ ఒక్కటే లేట్.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.ఇక ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరులు షో కు హోస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
మొత్తానికి ఎన్టీఆర్ అటు బుల్లితెర ఇటు వెండితెర లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.