ప్రపంచంలోని గొప్ప ధనవంతులలో అంబానీ, అదానీ , వారెన్ బఫెట్, బిల్ గేట్స్ ఇలా వీరే గొప్ప ధవంతులని మనకు తెలుసు.ఎందుకంటే వీరికి ఉన్న వ్యాపార సామ్రాజ్యాల వల్ల వారి సంస్థలు ప్రదర్శించిన పనితీరు ఆధారంగా వీరి సంపాదనను గొప్ప ధవంతులుగా లెక్కగడుతూ ఉంటారు.
ఇక వీరిని మించిపోయిన ధనవంతుడని ఎవరిదైనా కొత్త వ్యక్తి పేరు వినిపిస్తే ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడుతుంది.అతని కోసం వెతకడం ప్రారంభిస్తారు.
అవును అంబానీలను, అదానీలను ఓ బిలియనీర్ దాటేసాడు.అతని పేరు జాంగ్ షన్ శాన్.
ఇతను 91.7 బిలియన్ డాలర్స్ తో వారెన్ బఫెట్, అంబానీలను వెనక్కి నెట్టాడు.66 ఏళ్ల వయసు గల జాంగ్ షన్ శాన్ చైనాలో అతి పెద్ద బాటిల్ వాటర్ కంపెనీని స్థాపించి అగ్రగామిగా నిలిచాడు.ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప ధనవంతులలో ఆరవ స్థానంలో ఉన్నాడు.2021 ప్రారంభంలోనే 13.5 బిలియన్ డాలర్స్ సంపాదనతో అగ్రగామిగా ఉన్నాడు.ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం చూపు ఒక్కసారిగా ఇతని వైవు పడింది.ఇతని గురించి, కంపెనీ గురించి నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు.ప్రపంచంలో ఎవరూ విజయం సాధించినా మనందరికీ గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు.