టీఆర్ఎస్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను చింపివేశారని, తమ పార్టీ నేతలపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.చామనపల్లిలో దాడులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడమని తెలిపారు.ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్టీపీ జోలికి వస్తే ప్రజలు సహించరని షర్మిల హెచ్చరించారు.