దక్షిణాది రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్ ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రియాంకా గాంధీని నియమించే యోచనలో ఉంది.
త్వరలో జరగనున్న పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్ గా ప్రియాంక గాంధీ వ్యవహరించనున్నారు.
వాటిలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు పూర్తి స్థాయి ఇంఛార్జ్ గా ఉండనున్నారు.మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.