కోలీవుడ్ ప్రేమ జంట నయనతార ,విగ్నేష్ శివన్ లు తాజాగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.వీరిద్దరు ఎప్పుడెప్పుడు ఒకటవుతారా అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా విధంగా ఎదురు చూశారు.
ఇక ఎట్టకేలకు ఈ జంట ఒకటి కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దాదాపుగా అయిదేళ్లపాటు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా జూన్ 9న వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
ఇకపోతే ఈ జంట పెళ్లి తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.నాను రౌడీదాన్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు గతంలో లాక్డౌన్లో సమయంలో సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇకపోతే పూజరులు పండితులు చెప్పిన విధంగా ఈ మధ్యనే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చారు.
అయితే విగ్నేష్ శివన్ ఎంతగానో ఆరాధించే నటుడు రజనీకాంత్ చేతుల మీదుగా అందుకున్న మంగళ సూత్రాన్ని విఘ్నేశ్ నయనతార మెడలో మూడు ముళ్లు వేశాడు.ఈ క్రమంలోనే విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో తమ ప్రేమ కావ్యాన్ని సింగిల్ లైన్లోనే అద్భుతంగా ఈ విధంగా రాసుకొచ్చాడు.నయన్ మేడమ్ నుంచి కాదంబరి, కాదంబరి నుంచి తంగమే.
తంగమే నుంచి నా బేబీ, నా బేబీ నుంచి నా ఉయిర్.నా ఉయిర్ నుంచి కన్మణి, కన్మణి నుంచి ఇప్పుడు నా భార్యగా మారావు అంటూ లవ్ సింబల్ ఎమోజీలు పెడుతూ పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్తో పాటు కూడా ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.