పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 56వ సంవత్సరం పురస్కరించుకొని వాసవి మాతకు సుమారు కోటి రూపాయలతో అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించారు.జిల్లాలో ప్రథమ స్థానంలోనూ రాష్ట్రంలో అత్యతమ స్థానంలోనూ పూజలు అందుకుంటున్న వాసవి మాత ఎవరైనా ఉన్నారు అంటే అది తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మండవల్లి చెన్న నాగేందర్రావు అన్నారు.
తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మరియు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఉత్సవ కమిటీ చైర్మన్ వబ్బిలి శెట్టి నటరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి పట్టణ వీధులలో తిరిగే వెండి రథం, వివిధ రాష్ట్రాల కళాకారులతో తాడేపల్లిగూడెంలో నిర్వహించే రథయాత్రలో ఆకర్షణీయంగా ఉండే రథోత్సవం ఇవన్నీ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి మండ బ్రహ్మాజీ కోశాధికారి నున్నాసుందర్రావు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు