సీఎం పై ఆ పొడితో మెరుపు దాడి... కళ్లజోడు పగిలి ...ఆ తరువాత ఏమైంది అంటే ..?

మొన్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై … అందులోనూ … అత్యంత భారీ భద్రత ఉండే విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి తో దాడి జరిగిన సంఘటన మర్చిపోక ముందే… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి అనూహ్యంగా దాడికి దిగాడు.సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది.

 Unknown Person Attaks On Delhi Cm Krejiwal-TeluguStop.com

పావుకేజీ కారప్పొడి పొట్లంతో అనిల్ కుమార్ అనే వ్యక్తి సచివాలయంలోకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారం జల్లినట్టు వెల్లడించారు.

సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది.ఈ ఘర్షణలో దీంతో కేజ్రీవాల్ కళ్లజోడు కూడా … పగిలిపోయింది.దీంతో వెంటనే అప్రమత్తం అయినా పోలీసులు … నిందితుడు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అనిల్ కుమార్ భార్య సెక్రటేరియట్‌లోనే పనిచేస్తున్నట్టు చెబుతున్నారు….కాగా అతడు సీఎంపై ఎందుకు దాడికి దిగాడన్నది ఇంకా తెలియడం లేదు.అయితే… ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆమాద్మీ పార్టీ విమర్శించింది.అత్యంత ‘ప్రమాదకరమైన’ ఈ దాడిపై ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలని ఆమాద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube