ఏపీలో టీడీపీ పరిస్దితి అందరికి తెలిసిందే.కాగా తెలంగాణలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ మాయం అయ్యింది.
ఉన్న ఏ అరకొర నేతలు ఎలాగోలా పరిస్దితులకు తట్టుకుని నెట్టుకొస్తున్నారు.ఈ క్రమంలో పట్టు ఉన్న ఏపీలోనే టీడీపీ ఖాళీ అవుతుండగా ఏం చేయలేని అధినేత తెలంగాణలో ఆ పార్టీ గురించి ఆలోచించడం వ్యర్ధమే అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం తెలుగుదేశం అధినేతకు సిద్దిపేట నియోజకవర్గం ఇంఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ షాకిచ్చారు.తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ విషయాన్ని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.అంతే కాకుండా తన రాజీనామాను సహృదయంతో ఆమోదించాలని తెలియచేశారు.
ఇకపోతే ఈయనతో పాటుగా వెంకటేశం, తుమ్మల రాజేశం, సత్తయ్య వెంకటేశ్వరరావు, నరసింహారెడ్డి, తదితరులు కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.