దేవ దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్ప వృక్షాన్ని తీసుకున్నాడనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇంద్రుడు ఆ కల్ప వృక్షాన్ని తన నివాసానికి తీసుకెళ్లి నాటాడట.
ఈ ఒక్కటే కాకుండా ఇంద్రుడి ఇంటి ఆవరణలో మరో నాలుగు కల్ప వృక్షాలు ఉన్నాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇలా మొత్తం ఇంద్రుడి వద్ద ఐదు కల్ప వృక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో మొదటిది మందాన వృక్షం కాగా. రెండోది పారిజాత వృక్షం అట. మూడోది శంతన వృక్షం. నాలుగోది కల్ప వృక్షం.
అయిదవది హరి చందన వృక్షం. ఇవన్నీ ఇంద్రుడి లోకం అయిన దేవ లోకంలో ఉన్నట్లు మన పూర్వీకులు చెప్పారు.
ముందుగా ఈ చెట్లన్నీ భూలోకంలో ఉన్నప్పటికీ. ఎవరి ఇష్టానుసారంగా వారు చెడు కోరికలు కోరడంతో… దేవతలు ఈ చెట్లను ఇంద్రుడికి అప్పజెప్పినట్లు మరి కొన్ని పురాణ గ్రంథాల్లో ప్రస్తావించారు.
ఏది ఏమైనప్పటికీ. కోరిన కోరికలు ఇచ్చే కల్ప వృక్షాలు మాత్రం ఇప్పుడు భూమిపై లేవు.
హిందూ మత పురాణాల ప్రకారం గతంలో అంధకాసురుడు యుద్ధం ప్రకటించినప్పుడు తమ కుమార్తె అయిన ఆర్యని సురక్షణ కోసం శివ పార్వతులు. కల్ప వృక్షాన్ని వేడుకున్నట్లు తెలుస్తోంది.
దైవ కల్ప వృక్షానికే ఆర్యని సురక్షణ బాధ్యతలను అప్పగించారట. పార్వతీ దేవి తన కుమార్తె భద్రత, వివేకం, ఆరోగ్యం, ఆనందంతో పెంచుకోవాలని… అందుకోసం తన కూతురు ఆర్యని అడవుల రక్షకురాలైన వన దేవిగా చేయమని కల్ప వృక్షాన్ని కోరిందట. పార్వతీ దేవి కోరిక మన్నించిన కల్ప వృక్షం… ఆర్యనిని వన దేవతగా చేసిందట.