ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా నిలవడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా దీవెన పథకం గురించి తెలియని వారుండరు.అయితే ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు అందించేటువంటి సొమ్ము టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో జమ అయినట్లు పలు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో స్థానికంగా ఉన్నటువంటి కాలేజీలో లక్ష్మీ అనే విద్యార్థిని చదువుకుంటోంది.అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థులందరికీ విద్యా దీవెన కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇందులో భాగంగా లక్ష్మీ అనే విద్యార్థినికి కూడా విద్యా దీవెన కార్డు జారీ చేశారు.ఈ కార్డులో లక్ష్మీ ఫోటో కి బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోని ముద్రించారు.
దీంతో లక్ష్మీ వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ అప్పటికే కొందరు ఈ తప్పిదాలను ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.
అయితే ప్రభుత్వ అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయడం ఇదే మొదటిసారి కాదు.గతంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఫోటోతో స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తికి ఓటర్ కార్డు జారీ చేశారు.అప్పట్లో ఈ విషయం కూడా బాగానే వైరల్ అయింది.అయితే తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.