రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట, తిమ్మాపూర్ గ్రామల లో శనివారం కాంగ్రెస్ పార్టీ( Congress party ) రాష్ట్ర నాయకులు చీటీ ఉమేష్ రావు సుడిగాలి పర్యటన చేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను పరామర్శించి ఓదార్చారు.
బిఆర్ఎస్ నాయకులు హంగు ఆర్భాటాలతో విందులు చేసుకుంటున్నారని అన్నదాతలను పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
చీటీ ఉమేష్ రావు( Cheeti Umesh Rao ) తో పాటు మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, పందెర్ల శ్రీనివాస్ గౌడ్ విజయ్ రెడ్డి, కంచర్ల రాజు, దండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.