ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్సార్... గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వైయస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 The Great Leader Ysr Who Left An Indelible Mark In The Hearts Of The Peopl Vill-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి( YSR ) సేవలు మరువలేనివని, పేదవాడిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అన్నారు.

అతడు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని,అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి, మండల బిసి మోర్చా అధ్యక్షుడు గండి నారాయణ( Gandi Narayana ), నాయకులు మాడిశెట్టి అభిలాష్, సూర యాదయ్య, సర్గం పరంధాములు, పూదరి మహిపాల్, ఇప్ప మహేష్ , దయ్యాల శ్రీనివాస్, సనుగుల గంగాధర్ ,గండి అశోక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube