ఘోర విషాదం ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయినిపల్లి మండలం కొదురుపాక వద్ద శ్రీ రాజరాజేశ్వర మద్య మానేరు జలాశయంలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.కుమారుడు అయాన్ (7), కూతురు అశ్రజబిన్ (5) పసికందు ఉస్మాన్ (14 నెలలు) తల్లి రజిత (30) మృతి చెందారు.

 Woman Commits With Her Three Children Suicide In Rajanna Sircilla District,rajan-TeluguStop.com

వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.దాదాపుగా 9 సంవత్సరాల క్రితం మహమ్మద్ ఆలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఆత్మహత్యకు కారణాలు వివరాలు తెలియాల్సి ఉంది.సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్, బోయినిపల్లి ఎస్సై మహేందర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube