పార్టీల దిష్టి బొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల(Rajanna Sirisilla ) పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో పద్మశాలీయుల ఆధ్వర్యంలో నిరసన తెలిపి,పద్మశాలీయు లను గుర్తించని పార్టీల దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పద్మశాలి ఉపాధ్యక్షుడు కొండా ప్రతాప్( Konda Pratap ) మాట్లాడుతూ సిరిసిల్లలో ఎక్కువ సంఖ్యలో పద్మశాలి ప్రజలు ఉన్నారని తెలిపారు.

 Partys Dishti Doll Is Burning , Rajanna Sirisilla , Konda Pratap , Padmasali, Br-TeluguStop.com

అందువలన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో సిరిసిల్ల నియోజకవర్గ టికెట్ పద్మశాలీలకే ఇవ్వా లని డిమాండ్ చేశారు.

పద్మశాలీలకు( Padmasali )పద్మశాలీలకు టికెట్ ఇవ్వని పార్టీల బొమ్మలను దగ్ధం చేశామని తెలిపారు.

పద్మశాలి యువనేత ద్యావనపల్లి రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు పద్మశాలీలను గుర్తించా లని తెలిపారు.టికెట్ ఇవ్వని పార్టీలను పద్మశాలీలు గుర్తించరని, అవసరమైతే పద్మశాలీలము ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేసి బరిలో ఉంటామని తెలిపారు.

పద్మశాలిలను గుర్తించని రాజకీయపార్టీల యొక్క దిష్టి బొమ్మలను స్థానిక సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు.కనీసం ఇప్పుడైనా పార్టీలు గుర్తించి పద్మశాలలీలకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిపించుకుంటా మని తెలిపారు.వీరితోపాటు పద్మశాలి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube