మన దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిలిం ఫేర్ అవార్డులు ఒకటి.నటీనటులకు వారి నటనకు బహుమతిగా అవార్డులు వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.
మరి ఫిలిం ఫేర్ అవార్డు వస్తే ఇక వారు జీవితంలో దానిని మర్చిపోలేరు.ఉత్తమ నటీనటులకు, దర్శక నిర్మాతలకు మాత్రమే కాదు అన్ని క్యాటగిరీ వాళ్లకు ఫిలిం ఫేర్ అవార్డులు ప్రతి ఏడాది ఇస్తూనే ఉంటారు.
అయితే ఇప్పుడు ఫిలిం ఫేర్ అవార్డుల్లో పాత ఫోటో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది.అంతగా ఆ ఫొటోలో ఏముందా అని ఆలోచిస్తున్నారు.ఈ ఫొటోలో ఒకప్పటి ఎవర్ గ్రీన్ జంట అయిన విక్టరీ వెంకటేష్, సౌందర్య కలిసి దిగిన ఫోటో ఇది.ఈ జంటను చూసి అలనాటి స్మృతులను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
వీరిద్దరూ తమకు వచ్చిన అవార్డులను చేతిలో పట్టుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చారు.1999 సంవత్సరంలో ఈ అవార్డులను వీరు గెలుచు కున్నారు.ఆ సమయంలో ఈ ఇద్దరు ఎవర్ గ్రీన్ జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది.వెంకటేష్ సౌందర్య జంట అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం.
వీరు కలిసి చాలా సినిమాల్లో నటించారు./br>
జయం మనదేరా, రాజా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ లను తమ ఖాతాలో వేసుకున్నారు.అయితే సౌందర్య సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉండగానే మరణించడంతో ఈమె అభిమానులు తీవ్ర బాధను వ్యక్తం చేసారు.ఈమె బ్రతికే ఉంటే మరికొన్ని హిట్ సినిమాలు చేసేది.
కానీ అలా అకాలమరణం చెందడం ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోతున్నారు.